YS Jagan : ఎగ్జిట్ పోల్స్ వదిలేయండి.. మనకు భారీ విజయం పక్కా
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి(Andhra Pradesh) వై.ఎస్.జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) విజయంపై కొండంత ధీమాతో ఉన్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన జగన్ను పార్టీ ముఖ్యులు కొందరు కలిశారు. ఎన్నికల(Election) అనంతరం ఐ ప్యాక్(I-Pack) టీమ్తో సమావేశం అయిన జగన్ తమకు 2019 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని చెప్పారు.
![YS Jagan YS Jagan](https://s3.ap-south-1.amazonaws.com/media.ehatv.com/wp-content/uploads/2024/06/AP-ELETIONS-2024-EXIST-POLLS-compressed-1.jpg)
YS Jagan
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి(Andhra Pradesh) వై.ఎస్.జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) విజయంపై కొండంత ధీమాతో ఉన్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన జగన్ను పార్టీ ముఖ్యులు కొందరు కలిశారు. ఎన్నికల(Election) అనంతరం ఐ ప్యాక్(I-Pack) టీమ్తో సమావేశం అయిన జగన్ తమకు 2019 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని చెప్పారు. ఇక ఎగ్జిట్పోల్ వస్తుండటంతో ఈ అంశాన్ని జగన్ దగ్గర ప్రస్తావించారు నేతలు. గతంలో తాను చెప్పిందే మళ్లీ చెప్పారట! ఎగ్జిట్ పోల్స్(Exist Polls) పట్టించుకోవద్దని, జూన్ 4వ తేదీన మనం భారీ మెజారిటీతో గెలుస్తున్నామని వారిలో ఆత్మవిశ్వాసం నింపారని సమాచారం. పోలింగ్ శాతం నమోదో, మహిళల మద్దతు, సామాజికవర్గాల తీర్పు గుర్తించి భేటీలో చర్చ జరిగింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారంతా పార్టీకి అండగానిలిచారని జగన్ చెప్పారట! జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలతో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని జగన్ అన్నారట!
![Ehatv Ehatv](/images/authorplaceholder.jpg)