అధికారం కోసం చంద్రబాబునాయుడు(chandrababu) అబద్ధాలకు రెక్కలు కట్టారన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)

అధికారం కోసం చంద్రబాబునాయుడు(chandrababu) అబద్ధాలకు రెక్కలు కట్టారన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan). అందుకే టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారన్నారు. అధికారం ఈరోజు ఉండొచ్చు, లేకపోవచ్చు. రాజకీయాల్లో(Politics) విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు తాడేపల్లిలో పార్టీ నేతలతో వర్క్‌ షాప్‌ నిర్వహించిన జగన్మోహన్‌రెడ్డి వారిలో ఉత్సాహం నింపారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉందని జగన్ తెలిపారు. 'జమిలి ఎన్నికలు(Jamili elections) అని అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మన సన్నద్ధంగా ఉంటాం' అని జగన్‌ చెప్పారు.

'ఇప్పుడు మనం సోషల్‌ మీడియా కాలంలో ఉన్నాం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు, చెడిపోయిన వ్యవస్థలతో కూడా! ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లతో, తెలుగుదేశంపార్టీ(TDP) తప్పుడు సోషల్‌మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మనం నిజాన్ని బలంగా చెప్పాలి. పార్టీ కమిటీలన్నీ కూడా సోషల్‌ మీడియాకు అనుబంధం కావాలి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. మీ పేజీలను మీరే నడపాలి. అన్యాయాలను మనం ఎండగట్టాలి. పార్టీ సందేశాలు కూడా గ్రామస్థాయికి వెళ్లాలి. ఇదంతా సోషల్‌ మీడియా ద్వారా జరగాలి. వచ్చే రోజుల్లో దీనిపై బాగా దృష్టిపెట్టాలి. దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను తయారు చేయాలి' అని జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story