మోత మోగిద్దాం అంటూ తెలుగుదేశంపార్టీ(TDP) ఓ కార్యక్రమాన్ని డిజైన్‌ చేసింది. చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను(Chandrababu) వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్‌(NTR Family) కుటుంబం చేపట్టిన కార్యక్రమం ఇది! ఇవాళ సాయంత్రం ఏడు గంటల నుంచి అయిదు నిమిషాలపాటు ఎక్కడున్నా మోత మోగించాలని టీడీపీ(TDP) పిలుపునిచ్చింది.

మోత మోగిద్దాం అంటూ తెలుగుదేశంపార్టీ(TDP) ఓ కార్యక్రమాన్ని డిజైన్‌ చేసింది. చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను(Chandrababu) వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్‌(NTR Family) కుటుంబం చేపట్టిన కార్యక్రమం ఇది! ఇవాళ సాయంత్రం ఏడు గంటల నుంచి అయిదు నిమిషాలపాటు ఎక్కడున్నా మోత మోగించాలని టీడీపీ(TDP) పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రజలంతా ఒక్కటై ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా బయటకు వచ్చి గంట మోగించండి. ప్లేట్‌ మీద గరిటెతో కొట్టండి. లేదా విజిల్‌(whistle) వేయండి. వాహనంతో రోడ్డు మీద ఉంటే హారన్‌(Horn) కొట్టండి అని విజ్ఞప్తి చేసింది. మోత మోగించడమే కాదు,దానికి సంబంధించిన ఒక వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలని కూడా సూచించింది. ఈ పిలుపునకు మద్దతుగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, టీడీపీ నేత లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి వీరి అభ్యర్థనను మన్నించి ఆంధ్ర ప్రజలంతా ప్లేట్లు, గరిటెలు పట్టుకుని రెడీ అయిపోతారా? అసలు ఈ కార్యక్రమానికి ఎలాంటి స్పందన వస్తుంది? అన్నది వేచిచూద్దాం.

Updated On 30 Sep 2023 6:47 AM GMT
Ehatv

Ehatv

Next Story