ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యి.!

తిరుమల లడ్డూ(Tirumala laddu) తయారీకి వాడిన నెయ్యిలో(Ghee) కల్తీ జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నాయుడు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నారని, ఇప్పటికైనా ఆయన తప్పును ఒప్పుకోవాలని, లేకపోతే శ్రీ వేంకటేశ్వరస్వామి ఒప్పుకోరని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌(Vellampalli srinivas) చెప్పారు. ఒకవేళ మీరు చెప్పినట్టుగానే తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగితే ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అని నిల‌దీశారు. వైఫ‌ల్యాల నుంచి త‌ప్పించుకోడానికే చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు తెరతీశారని విమర్శించారు. తిరుమల ప్రసాదంపై దుర్మార్గపు రాజకీయానికి చంద్రబాబు పాల్పడ్డాడని వెల్లంపల్లి అన్నారు.

ల‌డ్డూ ప్ర‌సాదంపై సీఎం చంద్ర‌బాబు, టీటీడీ ఈవో శ్యామ‌లారావు పొంతన లేని మాటలు అంటున్నారని, ఒక‌వేళ నెయ్యి క‌ల్తీ అయింద‌నేందుకు ఆధారాలుంటే చ‌ర్య‌లు తీసుకోవాలి క‌దా? సిట్ ఎందుకని మాజీ మంత్రి నిలదీశారు. ఇక డిప్యూటీ సీఎం వపన్‌ కల్యాణ్‌(Pawan kalyan) కూడా గ‌తంలో స‌నాత‌న ధ‌ర్మం లేన‌ట్టు మాట్లాడుతున్నార‌ని, చెప్పులు వేసుకుని దీక్ష‌లు చేయ‌డం ఆయనకే చెల్లింద‌ని వెల్లంప‌ల్లి విమ‌ర్శించారు. స‌నాత‌న ధ‌ర్మంపై నీతులు చెప్ప‌డానికి ముందు, ప‌వ‌న్ ఆచ‌రించాల‌ని వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. హ‌రికృష్ణ మృత‌దేహం వ‌ద్ద పొత్తుల గురించి మాట్లాడిన నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుది అని ఆయ‌న విమ‌ర్శించారు. ఇప్పటికైనా త‌ప్పు ఒప్పుకుని చంద్ర‌బాబు ప్రాయ‌శ్చిత్త దీక్ష చేయాల‌ని వెల్లంపల్లి శ్రీనివాస్‌ కోరారు.

Eha Tv

Eha Tv

Next Story