వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు కొత్త సారథి

వైసీపీ సోషల్‌ మీడియాకు(YCP Social media) కొత్త సారథి వచ్చారు. ఏడాదిన్నరగా సోషల్ మీడియా బాధ్యతలను సజ్జల భార్గవ్‌(Sajjala Bhargav) చూశారు. సోషల్‌ మీడియాను సజ్జల భార్గవ్‌ పరుగులు పెట్టించారు. అప్పి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు(Chandrababu), లోకేష్(Lokesh) అండ్‌ కో సజ్జల నామస్వరం చేసేవారు. అంతలా సోషల్ మీడియాను ఊపేశారు సజ్జల భార్గవ. ఈ నేపథ్యంలో తాను సోషల్‌ మీడియా ఇంచార్జి నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు జగన్‌కు సజ్జల చెప్పారు. అయితే భార్గవ్‌ను కంటిన్యూ చేయాలని జగన్‌(YS Jagan), ఇతర నేతలు కూడా కోరారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సజ్జల భార్గవ్‌ చెప్పడంతో జగన్‌ మరొకరివైపు మొగ్గు చూపారు. జగన్‌ దగ్గరి బంధువు యశ్వంత్‌ను(Yashwanth) నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యశ్వంత్‌కు సజ్జల సరైన మార్గనిర్దేశం చేయాలని భార్గవ్‌కు జగన్‌ సూచించారు.

Eha Tv

Eha Tv

Next Story