వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YCP) సింగిల్ గా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్(CM Jagan) కూడా వై నాట్ 175 నినాదంతోనే ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మీ కుటుంబానికి మంచి జరిగిందని అనిపిస్తేనే.. నాకు ఓటేయండని ధీమాగా మాట్లాడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YCP) సింగిల్ గా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్(CM Jagan) కూడా వై నాట్ 175 నినాదంతోనే ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మీ కుటుంబానికి మంచి జరిగిందని అనిపిస్తేనే.. నాకు ఓటేయండని ధీమాగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని చెప్పుకొస్తున్నారు. దీంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి రూపకల్పన చేసారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు.

రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ఎందుకు రావాలనే క్యాంపెయిన్ నిర్వహించున్నారు. దీనికి సంబంధించి నెల రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయం వంటి అన్ని అంశాలను ప్రజలకు వివరించేలా ఈ క్యాంపెయిన్ నిర్వహించ‌నున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకూ అందరూ పాల్గొననున్నారు. అయితే కార్యక్రమం ఎలా నిర్వహించాలి,. ఏయే అంశాలపై ప్రజలకు వివరించాలి అనే దానిపై ముందుగానే రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించనుంది వైసీపీ అధిష్టానం.

Updated On 5 Oct 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story