ఏపీలో కుల గణన -2023(Kula ganana-2023)పై ప్రాంతీయ సదస్సు విజయవాడలో నిర్వహించారు. . ఈ సదస్సుకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chelluboina Venugopalakrishna), కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్(Sanjeev Kumar), ఎమ్మెల్యే ముస్తఫా, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, కె.లక్ష్మణరావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు హాజరయ్యారు.

ఏపీలో కుల గణన -2023(Kula ganana-2023)పై ప్రాంతీయ సదస్సు విజయవాడలో నిర్వహించారు. . ఈ సదస్సుకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chelluboina Venugopalakrishna), కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్(Sanjeev Kumar), ఎమ్మెల్యే ముస్తఫా, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, కె.లక్ష్మణరావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ ‘ఏపీలో కులగణన అనే చారిత్రక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) శ్రీకారం చుట్టారు. సీఎం జగన్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశమంతా సీఎం జగన్‌ ఆలోచనలను ఫాలో అవుతోందని, గతంలో మంజునాథన్ కమిషన్ ఫెయిలైందన్నారు. అందుకే సీఎం జగన్‌ శాశ్వత బీసీ కమిషన్‌ను వేశారని, బీహార్‌లో కులగణనకు రాజకీయ కోణం ఉందన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, సామాజిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమన్నారు. అన్ని సామాజిక వర్గాలపై సీఎం జగన్‌కు ఎంతో గౌరవం ఉందని, గతంలో ఉద్యమాలు చేసినా కులగణన ప్రక్రియలో ఫలితాలు రాలేదన్నారు.

ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఏపీలో కులగణనతో ఒక చరిత్ర మొదలవ్వబోతోందని, బీసీలు ఏకమైతే రాజకీయంగా బలవంతులవుతారని 70 ఏళ్లుగా మనల్ని ఎదగనివ్వలేదన్నారు. సీఎం జగన్‌ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, ఆనాడు మనకు రిజర్వేషన్లు కల్పించిన కారణజన్ముడు అంబేద్కర్ అని, ఈనాడు కులగణనకు శ్రీకారం చుట్టి సీఎం జగన్‌ కారణ జన్ముడయ్యాడయ్యారని అన్నారు . ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయాల కోసం కులగణన చేయడం లేదని, కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, ఏపీలో జరగబోయే కులగణన దేశానికే ఒక నిర్ధేశం అవుతుందన్నారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ కులగణన చేయాలని సీఎం జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ధన్యవాదాలు. అన్ని కులాలకు మేలు జరగాలని 90 ఏళ్ల తర్వాత సీఎం జగన్‌ ధైర్యంగా ఒక అడుగు ముందుకేశారు. మన దేశంలో కులం అనేది ఒక కల్చరల్ ఈవెంట్ వంటిది. కులగణన జరిపే క్రమంలో పకడ్భంధీగా వ్యవహరించాలని కోరుతున్నానన్నారు.

ఎమ్మెల్సీ లక్ష్మణరావు(MLC Lakshman Rao) మాట్లాడుతూ బీసీ కులగణన చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కులగణనకు చట్టబద్ధత ఉండాలి. సచివాలయ సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగులను జతచేసి చేయాలి. కోర్టు సమస్యలు రాకుండా ఉండాలంటే వాలంటీర్లను కులగణనలో భాగస్వామ్యులను చేయొద్దని కోరుతున్నాను. రాష్ట్రంలోని నాలుగు కమిషన్లను భాగస్వామ్యులను చేయాలి. వలస కార్మికులు, సంచార జాతులపై ప్రత్యేక దృష్టి సారించాలి. కులగణన జరిగిన తర్వాత సచివాలయాల వద్ద లిస్టులు ప్రదర్శించాలి. కులగణన జరిగే పది రోజుల్లో ఒక రోజు సెలవు ప్రకటించి ఆరోజు అందరి వివరాలు తీసుకోవాలి. ఈకేవైసీకి కులగణనకు ముడి పెట్టవద్దని కోరుతున్నా. కులగణన విజయవంతం కావాలని కోరుతున్నానన్నారు.

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ కులగణన జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. కులగణనను సీఎం జగన్‌ రాజకీయం కోసం చేయడం లేదు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందేవారికి కులగణనతో చెక్ పడుతుంది. సీఎం జగన్‌ చొరవతో 90 ఏళ్ల తర్వాత కులగణన జరగబోతోంది. కులగణన విజయవంతం కావాలని కోరుతున్నానన్నారు.

Updated On 20 Nov 2023 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story