వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(Duvvada srinivas) వివాదంలో కీలకవ్యక్తి మాధురికి(Madhuri) ప్రమాదం జరిగింది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(Duvvada srinivas) వివాదంలో కీలకవ్యక్తి మాధురికి(Madhuri) ప్రమాదం జరిగింది. టెక్కలి(Tekkali) నుంచి పలాస వెళుతున్న మాధురి కారు ప్రమాదానికి(Car accident) గురైంది. ఈ ప్రమాదంలో దివ్వెల మాధురికి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం పలాస ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆగి ఉన్న కారును మాధరి కారు ఢీకొంది. ఆ సమయంలో కారును మాధురి నడుపుతున్నది. తలకు గాయమవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే మరో ట్విస్టు. తాను చనిపోవడానికే ఆగి వున్న కారును ఢీకొట్టానని మాధురి చెప్పారు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, తనకు ఎలాంటి చికిత్సను అందించవద్దని తెలిపింది. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేకే తాను ఈ పనికి ఒడిగట్టానని తెలిపింది.

Updated On 11 Aug 2024 10:49 AM GMT
Eha Tv

Eha Tv

Next Story