ఎన్నిక‌ల వేళ ఏపీ రాజ‌కీయాలలో హీట్ పెరిగింది. అధికార వైసీపీ ఇప్ప‌టికే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి దూకుడుగా ముందుకు వెళుతుండ‌గా..

ఎన్నిక‌ల వేళ ఏపీ రాజ‌కీయాలలో హీట్ పెరిగింది. అధికార వైసీపీ ఇప్ప‌టికే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి దూకుడుగా ముందుకు వెళుతుండ‌గా.. ఎన్డీఏ కూట‌మి అభ్య‌ర్ధుల ఫైన‌ల్ లిస్టు సిద్ధం చేసేందుకు త‌ల‌మున‌క‌లై ఉంది. ఇక ష‌ర్మిల నేతృత్వంలోని ఏపీ కాంగ్రెస్ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించాల్సివుంది. అయితే.. వైసీపీలో టికెట్ దొర‌క‌ని నేత‌లు ప్ర‌త్యామ్న‌యం కోసం చూస్తూ ప‌క్క పార్టీల‌లోకి జంప్ అవుతున్నారు.

ఇటువంటి ప‌రిస్థితుల‌లోనే నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ ఇచ్చాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధ‌ర్‌. వైసీపీని వీడుతూ ష‌ర్మిల స‌మ‌క్షంలో ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల ఆర్ధ‌ర్‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో నందికొట్కూరు వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం జరిగింది. అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో కూడా ఆర్ధ‌ర్‌కు విభేదాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది.

Updated On 19 March 2024 7:50 AM GMT
Yagnik

Yagnik

Next Story