వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను(Rajyasabha members) సంతలో పశువుల్లాగా కొనుగోలు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను(Rajyasabha members) సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసి, వారితో రాజీనామా చేయించిన చరిత్రహీనుడు చందరబాబునాయుడు(chandrababu) అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaysai reddy) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఎక్స్‌లో ఓ పోస్టు చేస్తూ చంద్రబాబు దుష్ట రాజకీయాలను ఘాటుగా విమర్శించారు. 'చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషపు బాణాలుంటాయి.వాటిని ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వావివరుసలు లేకుండా నచ్చని వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు.మాటలతో గానీ,ప్రవర్తనతో గానీ మంచి వారిని బాధిస్తే నరకం వస్తుందని ధర్మశాస్త్రం చెబుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఇతనిని శిక్షించడా? హిందూ ధర్మశాస్త్రం, కర్మ సిద్ధాంతం చంద్రబాబుకు వర్తించదా? మరి ఇతడు పుట్టిన దగ్గరనుండి ఇతరులను వేధిస్తూనే పెరిగాడు. 75ఏళ్ళు వచ్చాయి. ఇంకా బాధిస్తూనే వున్నాడు.ఇతని పాపాలను చూసి దేవుడు కూడా దడుచుకున్నాడేమో అనిపిస్తున్నది. ఏది ఏమయినా బాధ పడుతున్నది ప్రజలు. ఎదుటివాళ్ళేగా.చంద్రబాబు బాగానే ఉన్నాడు.ఏ కోర్టులు ఇతడికి శిక్షలు వేయలేవు.చంద్రబాబు లాంటి వాళ్ళ గురించి జంధ్యాల పాపయ్యశాస్త్రీ గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి.మా కండలు పిండిన నెత్తురు మీ పెండ్లికి చిలికే అత్తరు.మా మొగాన కన్నీరా మీ మొగాల పన్నీరా.కర్మల ప్రతికూల ఫలాలు ఈ జన్మలోనే తప్పక అనుభవిస్తావు చంద్రబాబు!' అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.




Updated On 25 Sep 2024 7:56 AM GMT
Eha Tv

Eha Tv

Next Story