తన భార్యతో రెండేళ్లుగా విభేదాలున్నాయని వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు

తన భార్యతో రెండేళ్లుగా విభేదాలున్నాయని వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి చేస్తున్న నిరసనలపై దువ్వాడ స్పందించాల్సి వచ్చింది. తన భార్య ఎప్పటి నుంచో అధిపత్య పోరు కోసం ప్రయత్నం చేస్తున్నారని.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా సార్లు ప్రయత్నం చేశారన్నారు. కూతుళ్లలో నాపై వ్యతిరేక భావనను వాణి తీసుకొచ్చారని.. నా ఇంటి వద్దకు వచ్చేటప్పుడు టీడీపీ మూకలను కూడా తీసుకొచ్చారని ఆరోపించారు. నా భార్య ఆందోళన వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన మైనింగ్ వ్యాపారంలోనూ వాణి పేరుండాలని కోరుకుందన్నారు దువ్వాడ. తాను టెక్కలిలో ఐదుసార్లు ఓడిపోవడానికి భార్యనే కారణమని కూడా దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఎన్నికల సమయంలో టికెట్ కావాలని నా భార్య అడిగారని.. విడాకులు కోరుతూ జగన్ వద్దకు సైతం వెళ్లిందని తెలిపారు. ఎన్నికల తర్వాత విడాకులు ఇస్తానని చెప్పానని.. ఎన్నికల్లో నేను ఓడిపోయానన్నారు దువ్వాడ. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నా భార్య ప్రయత్నం చేశారని.. నా పిల్లలు నన్ను శత్రువుగా చూస్తున్నారన్నారు. పిల్లలను ఏ లోటూ రాకుండా చూసుకున్నానని.. వివాదాలు రాకుండా ఆస్తులు సైతం ఇచ్చేశానన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story