ప్రజానీకం కోసం కాదు.. నువ్వు రాజకీయాలు చేసేది.. అక్రమ కేసులు నుంచి బయటపడి, ఆస్థులు కాపాడుకొని.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు.

అర్ కృష్ణయ్య చేసిన పోరాటాలను CM జగన్ గుర్తించారని విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్ తెలిపారు. బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్యకు పదవి ఇచ్చి ప్రతిఫలం అందించారన్నారు. బడుగు బలహీన వర్గాలకు జగన్ ఏంతో మేలు చేశారని.. గతంలో అనేక పార్టీలు బీసీలను ఓటు బ్యాంక్ గానే వాడుకున్నాయని.. జగన్ వారిని బ్యాక్ బోన్ కాస్ట్ గా మార్చారన్నారు.

పార్టీ పదవులు, కార్పోరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి బీసీల‌కు జ‌గ‌న్‌ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. టీడీపీ హయాంలో బీసీల‌ను దుర్బాషలడారు.. నాయి బ్రాహ్మణుల తోక కత్తిరిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గతంలో టీడీపీ ఏ విధంగా చూసింది.. ఇప్పుడు ఎలాగా ఉన్నారో బీసీలు గ్రహించాలన్నారు. టీడీపీ మీడియా, సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసిన ప్రజలు జగన్నే కోరుకుంటున్నారని అన్నారు. జిల్లాలో బీసీలకు మంత్రి పదవి, జ‌డ్పీ చైర్మన్, దుర్గ గుడి ఛైర్మన్ ఇచ్చారని వెల్ల‌డించారు. దొంగ హామీలతో వస్తున్న టీడీపి నేతలు 14 యేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారని ప్ర‌శ్నించారు.

టీడీపీ పెట్టిన మీటింగ్ లు ఆన్ని ఫ్లాప్ లే అన్నారు. మోదీని పచ్చి బూతులు తిట్టి.. ఇప్పుడు అదే మోదీని చంద్రబాబు పొగుడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. ప్రజానీకం కోసం కాదు.. నువ్వు రాజకీయాలు చేసేది.. అక్రమ కేసులు నుంచి బయటపడి, ఆస్థులు కాపాడుకొని.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు.

పెత్తందారులకు అవకాశం ఇవ్వవోద్దని పిలుపునిచ్చారు. జగన్ మళ్లీ సీఎం అయితే అందరి భవిష్యత్ బాగుంటుందన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని వివ‌రించారు.

Updated On 20 March 2024 10:36 PM GMT
Yagnik

Yagnik

Next Story