గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతుండగా ఉన్నట్టుండి సోఫాలో ఒరిగిపోయారు. నానికి జ్వరం రావడంతో నీరసించారని ప్రచారం జరిగింది. వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా సోఫాలో కొడాలి నాని కుప్పకూలారంటూ కథనాలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై గన్ మెన్లు వైద్యులకు సమాచారం అందించారు. ఇంట్లో నుండి పార్టీ నాయకులను గన్ మేన్లు పంపించేశారు.

ప్రధమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నానికు సైలెన్ ఎక్కించారు వైద్యులు. విషయం తెలుసుకొని హైదరాబాద్ నుండి గుడివాడ బయలుదేరారు కొడాలి నాని కుటుంబ సభ్యులు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని నాని ఓ వీడియో విడుదల చేశారు. తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు ఓ వీడియో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తన నివాసంలో సోఫాలో కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ ఉన్న వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఆ వీడియోలో ఆరోగ్యంగా శుభ్రంగా సోఫాలో కూర్చుని సేదతీరుతూ కనిపించడం జరిగింది.

Updated On 24 May 2024 2:23 AM GMT
Yagnik

Yagnik

Next Story