వైసీపీ(YCP) నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్(MP Gorantla Madhav) టిడిపి(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu), ఆయన తనయుడు లోకేష్(Lokesh), జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ(YCP) నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్(MP Gorantla Madhav) టిడిపి(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu), ఆయన తనయుడు లోకేష్(Lokesh), జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో ఆయన మాట్లాడుతూ.. 2024లో చంద్రబాబు చస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మరోమారు ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అగ్రభాగాన నిలబెట్టింది జగన్ మాత్రమే అన్నారు. వారంతా 2024లో మరో మారు జగన్ పక్షాన నిలబడతారని పేర్కొన్నారు.

చంద్రబాబు బస్సు యాత్ర(Bus Yatra) చేసి.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేశ్ యువగళం యాత్ర చేసి.. ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరిగే యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్రను పక్కన పెట్టి పారిపోయారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర(Varahi Yatra) చేసి.. ఇప్పుడు పారిపోయే యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని యాత్రలు చేసినా వైయస్ జగన్ జైత్రయాత్రను ఎవరు ఆపలేరు అన్నారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి.

Updated On 27 Oct 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story