ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు మంత్రులు పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు మంత్రులు పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్‌ను వెంటనే పునరుద్దరించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను కేవలం కక్ష సాధింపునకు మాత్రమే ఉపయోగించుకుంటోందని చెప్పారు. చంద్రబాబు అసమర్థత వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలపై దాడులు జరుగుతుంటే హోంమంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారని రోజా అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పవన్‌కు, లోకేష్‌కు కనిపించడం లేదా? అని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్‌కు ఆడ బిడ్డ విలువ తెలియదు. పవన్ ఒక ఆడ బిడ్డ తండ్రిగా ఆలోచన చేయండి. కంటి మీద కునుకు లేదు. 'రాష్ట్రంలో ఆడ బిడ్డల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. బాలకృష్ణ.. షూటింగ్స్‌ చేసుకునే వాళ్లకు ఎందుకు రాజకీయాలు?. మీ నియోజకవర్గంలో అత్తాకోడళ్ళపై అత్యాచారం చేస్తే కనీసం పట్టించుకోవడం లేదు. ఆడబిడ్డలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది' అని ఆర్కే రోజా అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story