జనసేన(janasena) అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan).. టీడీపీ(TDP) అధ్య‌క్షుడు చంద్రబాబు(Chandrababu) కోసమే పని చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(Dwarampudi Chandrasekhar Reddy) ఆరోపించారు. ఆదివారం రాత్రి త‌న‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ..

జనసేన(janasena) అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan).. టీడీపీ(TDP) అధ్య‌క్షుడు చంద్రబాబు(Chandrababu) కోసమే పని చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(Dwarampudi Chandrasekhar Reddy) ఆరోపించారు. ఆదివారం రాత్రి త‌న‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. జక్కంపూడి రామ్మోహన్ రావు(Jakkampudi Rammohan Rao) శిష్యుడిగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తనను విమర్శించే స్థాయి పవన్‌కు లేదన్నారు.

పవన్ తనపై చేసిన అసత్య ఆరోపణలను నిరూపించాలని ద్వారంపూడి సవాలు విసిరారు. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి అని.. రాజకీయ వ్యభిచారి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎవరిని ఉద్దరించడానికి ప‌వ‌న్‌ జనసేన పార్టీని స్థాపించారో అందరికి తెలుసునన్నారు. ప‌వ‌న్ త‌న‌ను నమ్ముకున్నవాళ్లను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. ప్యాకేజీలు, సీట్లు ఒప్పందం కుదరకుంటే పవన్ రోడ్డు మీదకు వస్తాడని, పవన్ ఎంఎల్‌ఎ కావాలన్నా.. సీఎం కావాలన్నా అది సినిమాల్లోనే సాధ్యమవుతుందన్నారు. పవన్ రాజకీయపరంగా జీరోగా ఉన్నారని ఎద్దేవా చేసిన ద్వారంపూడి.. ఆయ‌న పెట్టే మీటింగ్‌ల కంటే పెద్ద మీటింగ్‌లు పెట్టగలమన్నారు. కాకినాడలో అన్ని సామాజిక వర్గాలు కలిసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాయని.. అస‌లు జనసేన పార్టీ ఎజెండా ఏంటని ద్వారంపూడి ప్రశ్నించారు.

Updated On 19 Jun 2023 2:18 AM GMT
Ehatv

Ehatv

Next Story