సార్వత్రిక ఎన్నికలకు ఎంత లేదన్నా ఏడాది సమయం ఉంది. అప్పుడే పార్టీ గెలుస్తుందన్నది ఇప్పుడు చెప్పడం ఒకింత కష్టమే కానీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకోగలదో చెప్పడం ఏమంత కష్టం కాదు.. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్‌ నౌ నవభారత్‌ ఇదే విషయంపై ఓ సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఘన విజయానని సాధిస్తుందని అందులో తేలింది.

సార్వత్రిక ఎన్నికలకు ఎంత లేదన్నా ఏడాది సమయం ఉంది. అప్పుడే పార్టీ గెలుస్తుందన్నది ఇప్పుడు చెప్పడం ఒకింత కష్టమే కానీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకోగలదో చెప్పడం ఏమంత కష్టం కాదు.. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్‌ నౌ నవభారత్‌ ఇదే విషయంపై ఓ సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ (YCP)పార్టీ ఘన విజయానని సాధిస్తుందని అందులో తేలింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇందులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని సర్వే చెప్పంది. అంటే ఓ విధంగా క్లీన్‌ స్వీప్‌ అన్నమాట. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మహా అయితే ఓ సీటు రావచ్చని సర్వే చెబుతోంది. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా రాదని సర్వే అంచనా వేసింది. తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ పార్టీకి 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ నవభారత్‌ తెలిపింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలున్న విషయం తెలిసిందే. బీజేపీకి మూడు నుంచి అయిదు లోక్‌సభ స్థానాలు వస్తాయట. కాంగ్రెస్ పార్టీకి రెండు నుంచి మూడు సీట్లు లభిస్తాయట. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మజ్లిస్‌ ప్రస్తావన లేకపోవడం! ఆ లెక్కన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం ఎవరికి దక్కుతుందో!

Updated On 1 July 2023 7:58 AM GMT
Ehatv

Ehatv

Next Story