AP Elections : నేడు చంద్రబాబు అధ్యక్షతన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వర్క్షాప్
ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల గెలుపుకై కీలక సూచనలు, సలహాలు ఇవ్వడానికి సిద్ధమైంది

Workshop for MLA and MP candidates under the presidency of Chandrababu
ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల గెలుపుకై కీలక సూచనలు, సలహాలు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందుకోసం టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు శనివారం వర్క్షాప్ నిర్వహించనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ వర్క్షాప్ జరగనుంది.
వర్క్షాప్లో ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01:30 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో చంద్రబాబు అభ్యర్థులకు కీలకమైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు వర్క్షాప్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు.
అభ్యర్థులతో పాటు, ఎన్నికల కోసం అధిష్టానం నియమించిన నలుగురు మేనేజర్లు కూడా వర్క్షాప్కు హాజరుకానున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల హక్కులు, అధికార పార్టీని ఎదుర్కోవడం వంటి కీలకమైన అంశాలు కవర్ చేయబడతాయి. ఎన్నికల ప్రచారం, నామినేషన్ల దాఖలు ప్రక్రియపై కూడా చర్చలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహాలను సవివరమైన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించనున్నారు.
ఈ వర్క్షాప్కు జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలు హాజరుకానున్నారు. ఈ వర్క్షాప్ తర్వాత టీడీపీ అగ్రనేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈవెంట్కు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
