వివాహం విందు అంటే పసందైన వంటకాలు.. చక్కటి భోజనం ఏర్పాటు చేస్తారు. కానీ ఓ వివాహంలో విందు భోజనం వికటించింది. శ్రీకాకుళం జిల్లా(Srikakulam) మందస(Mandasa) మండలం నల్లబొడ్లూరు(Nalla Bodluru) గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరులో ఓ వివాహ వేడుకకు బంధుమిత్రులంతా హాజరయ్యారు.

వివాహం విందు అంటే పసందైన వంటకాలు.. చక్కటి భోజనం ఏర్పాటు చేస్తారు. కానీ ఓ వివాహంలో విందు భోజనం వికటించింది. శ్రీకాకుళం జిల్లా(Srikakulam) మందస(Mandasa) మండలం నల్లబొడ్లూరు(Nalla Bodluru) గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరులో ఓ వివాహ వేడుకకు బంధుమిత్రులంతా హాజరయ్యారు. పెళ్లిని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన భోజనాలు వికటించాయి. వివాహ విందు వికటించి మహిళ మృతి చెందింది. పలువురు అస్వస్థత పాలయ్యారు. మృతురాలు మందస మండలం బేతాళపురం గ్రామానికి చెందిన తెప్పల జానకమ్మ (35). ఈ విషాదంలో అస్వస్థతకు గురైన మరో 10 మందిని హరిపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మందస పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated On 9 Dec 2023 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story