ఓ ఉపాధ్యాయుడికి(Teacher) ఒక్కగానొక్క కూతురు ఉంది. చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.

ఓ ఉపాధ్యాయుడికి(Teacher) ఒక్కగానొక్క కూతురు ఉంది. చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఏడాదిన్నర క్రితం భార్య చనిపోయినా కూడా తల్లి పోయిందన్న బాధలేకుండా కూతురును ఓదారుస్తూ ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. తన బిడ్డ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలని కష్టపడి ఇల్లు కొన్నాడు. ఇందుకోసం సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. కానీ తన కూతురు మనసులో ఉన్న దుర్బుద్ధిని గమనించలేకపోయాడు. తన బాయ్‌ఫ్రెండ్స్‌తో(Boyfriend) రొమాన్స్‌కు(romance) అడ్డుగా ఉన్నాడని ఏకంగా తండ్రిని చంపించిందో(Murder) రాక్షస జాతికి చెందిన కూతురు. కూతురు చేతిలో హత్యగావింపబడి విగతజీవిగా మారిపోయాడో అనాథ తండ్రి.. ఈ హృదయవిదారకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఏపీలోని అన్నమయ్య (annamaya) జిల్లా మదనపల్లెలో(Madhanepalle) ఈ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లెలోని పోస్టల్ అండ్‌ టెలికం కాలనీలో దొరస్వామి అనే వ్యక్తి తన కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితమే ఇతని భార్య కూడా చనిపోయింది. ఇతను స్థానిక జీఆర్‌టీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. సౌమ్యుడిగా, మంచి మనిషిగా దొరస్వామికి పేరు ఉంది. త్వరలోనే ఇతను రిటైర్‌ కాబోతున్నాడు. రిటైర్మెంట్‌ అయిన తర్వాత వచ్చే డబ్బులతో కూతురు పెళ్లి ఘనంగా జరిపించాలనుకున్నాడు. కూతురు కట్నంగా చ్చేందుకు రూ.80 లక్షల విలువైన ఓ ఇల్లును కూడా కొన్నాడు. ఇంత మంచి మనిషి అని గుర్తింపు తెచ్చుకున్న దొరస్వామికి రాక్షస జాతికిచెందిన హరిత అనే కూతురు కూడా ఉంది. బీఎస్సీ బీఈడీ వెలగబెట్టింది. హరిత కోసం కుప్పంలో ఓ సంబంధం కూడా చూశాడు. కానీ ఊహించనివిధంగా దొరస్వామి చనిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.

పోలీసులు లోతుగా విచారించగా పెళ్లి విషయంలో తండ్రి, కూతురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. కూతురు హరిత అప్పటికే ఇద్దరితో రొమాన్స్‌ చేస్తూ వస్తోంది. రోజుకొకరితో ఇంట్లో రొమాన్స్‌ చేస్తూ ఉండేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇది తండ్రి దొరస్వామికి కూడా తెలియడంతో కూతురుకు వెంటనే పెళ్లి జరిపించాలని ఆయన భావించారు. ఇదే విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో బాయ్‌ఫ్రెండ్స్‌తో తన రొమాన్స్‌కు అడ్డుగా ఉండడమే కాకుండా ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తాడన్న ఆందోళనతో తండ్రిని అడ్డుతొలగించుకుంటే హ్యాపీగా ఎంజాయ్‌ చేయొచ్చని ప్లాన్‌ వేసింది. ఇందు కోసం ఓ ప్రియుడికి రూ.10 లక్షల సుపరీ కూడా ఇచ్చినట్లు సమాచారం. బుధవారం రాత్రి దొరస్వామి మద్యం సేవించి ఇంట్లో పడుకున్నాడు. ఇదే అదునుగా భావించిన హరిత తన తండ్రిని కొట్టి చంపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హరితను విచారించగా ఇంట్లోకి ఎవరో ప్రవేశించి హత్య చేశారని బుకాయించింది. పోలీసులు లోతుగా ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. చపాతి చేసే కర్రతో, రాడ్డుతో దాడి చేసి తండ్రిని హత్య చేసినట్లు చెప్పింది. అయితే ఈ మాటలను కూడా పోలీసులు నమ్మడం లేదు. ఇది ఒకరు చేసే పనికాదని, మరో ఒకరిద్దురు ఈ హత్యలో పాత్ర ఉందని భావిస్తున్నారు పోలీసులు. హరిత బాయ్‌ఫ్రెండ్స్‌ గురించి ఆరా తీయగా ఒకరు తిరుపతి దర్శనానికి వెళ్లినట్లు, మరొకరు అందుబాటులో లేడని పోలీసులు చెప్తున్నారు. ఏ ప్రియుడితో కలిసి హరిత తన తండ్రిని చంపిందోనన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story