భర్త(Husband) పెడుతున్న వేధింపులను తట్టుకోలేకపోయింది భార్య.

భర్త పెడుతున్న వేధింపులను తట్టుకోలేకపోయింది భార్య. మారతాడని ఓపికపట్టింది. పెడుతున్న బాధలను భరించింది. ఇక సహనం కోల్పోయింది. భర్తను చంపేసింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన 30 ఏళ్ల లక్క ప్రశాంత్‌కు, కడప జిల్లా పులివెందులకు చెందిన అమీనాకు కొన్నేళ్ల క్రితం రెండో వివాహం జరిగింది. మొదటి సంతానానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు పెనుగొండలో ఉంటున్నారు. అమీనా తల్లి నూర్జహాన్‌, సోదరుడు అమీర్‌పాషా అదే ఊర్లో వేరే ఇంట్లో ఉంటున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ప్రశాంత్‌ రోజూ తప్పతాగి వచ్చి ఇద్దరు పిల్లలు తనకు పుట్టలేదని అమీనాను వేధిస్తుండేవారు. ఆ వేధింపులు భరించలేక ప్రశాంత్‌ను హత్య చేయాలని అనుకుంది. ఇందుకు తల్లి, సోదరుడి సాయం కోరింది. ఈ నెల 10వ తేదీన తెల్లవారుజామున అమీనాతోపాటు ఆమె తల్లి నూర్జహాన్‌, సోదరుడు అమీర్‌పాషా కలిసి నిద్రపోతున్న ప్రశాంత్‌ మెడకు తాడు బిగించి చంపేవారు. . ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాలనుకున్నారు. హాస్పిటల్‌కు అని చెప్పి ఆటో మాట్లాడుకున్నారు. అయితే ప్రశాంత్‌ మృతదేహాన్ని మహబూబాబాబ్‌లోని రైల్వే గేట్‌ వైపు తీసుకుపోవాలని ఆటోడ్రైవర్‌ రాముకు చెప్పడంతో అతడిని అనుమానం వచ్చింది. 100 నంబర్‌కు డయల్‌చేశాడు. పోలీసులు వచ్చి అమీనా, నూర్జహాన్‌, అమీర్‌పాషాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Eha Tv

Eha Tv

Next Story