మానవహక్కుల ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ(Delhi university) మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా(Prof.Sai Baba) మరణం చాలా మందిని కదిలించింది.

మానవహక్కుల ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ(Delhi university) మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా(Prof.Sai Baba) మరణం చాలా మందిని కదిలించింది. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్(Hyderabad NIMS) లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు(Death). ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే చూడాలన్నది చాలా మంది వాదన! తాను నమ్మిన సిద్ధాంతానికి కనుమూసే వరకు కట్టుబడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించారు సాయిబాబా. అయిదేళ్ల వయసులో ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. అయినా ఆయన కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. అమలాపురంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సాయిబాబా హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ప‌ని చేశారు. 2013లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అమలాపురంలో డిగ్రీ చదువుతున్న కాలంలోనే సాయిబాబా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు. తర్వాత ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ (ఏఐఆర్‌పీఎఫ్) లో చేరారు. 1992లో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు ఏఐఆర్‌పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి అయ్యారు. 1995లో ఆ సంస్థకు ఇండియా ప్రధాన కార్యదర్శి గా కూడా పనిచేశారు. దీని తరువాత ఆర్‌డీఎఫ్ అనే సంస్థలో పని చేశారు సాయిబాబా. తెలంగాణలోని ప్రజా ఉద్యమాలే తనకు చదువును, చైతన్యాన్ని నేర్పాయని, తనను వ్యక్తిగా తీర్చిదిద్దింది తెలంగాణే అని సాయిబాబా ప‌లు సంద‌ర్భాల్లో పేర్కొన్నారు.

2014లో ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న స‌మ‌యంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు(Maharashtra police) అరెస్ట్ చేశారు. అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది. కాగా, 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో అయిదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయ‌ల్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. దాంతో ఆయన 2017 నుంచి నాగ్‌పూర్‌ జైలులోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. 2017లో జీవిత ఖైదు విధించ‌డంతో.. మ‌ళ్లీ ఆయ‌న నాగ్‌పూర్ జైలుకు వెళ్లారు. ఈ ఏడాది మార్చి 6వ తేదీ వ‌ర‌కు జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌చ్చింది. మార్చి 7వ తేదీన‌ నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు. పదేళ్లపాటు వీల్‌ఛైర్‌లోనే జైలు జీవితం గడిపారు. ప్రభుత్వం సాయిబాబా జీవితాన్ని సర్వ నాశనం చేసింది. జైలులో ఆయన పడిన యాతన అంతా ఇంతా కాదు! కరోనా స‌మ‌యంలో అయితే అత్యంత దుర్భ‌ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి ఎన్నిసార్లు అప్పీలు చేసుకున్నా న్యాయస్థానాలు పట్టించుకోలేదు. జైల్లో ఉన్న కాలంలో సాయిబాబాను 21 రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. జైల్లో సరైన సదుపాయాలు కల్పించడం లేదని.. కరోనా వైరస్ పేరుతో చంపడానిక కుట్ర చేస్తున్నారని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం నిర్దయగా వ్యవహరించింది. వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాలలో వాదిస్తూ వచ్చింది. ఆ ఆరోగ్య సమస్యలే సాయిబాబా ప్రాణాలను తీసుకున్నాయి. పదేళ్ల పాటు చీకటి జీవితాన్నే అనుభవించారు. జైలు అధికారులు ఆయనను మానసికంగా వేధించారు. ఆయనను వీల్ చైర్‌ కూడా తిరగని సెల్‌లో ఉంచి తమలోని క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు.

అరెస్టుకు ముందు కొంతమంది అధికారులు ఆయనను కలిసి తాము చెప్పినట్లుగా చేస్తే వదిలేస్తామని, లేకుంటే తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపి బయటకు రాకుండా చేస్తామని హెచ్చరించారట! ఈ విషయాన్ని సాయిబాబే స్వయంగా చెప్పుకున్నారు. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని ఉంచే సెల్‌లో సాయిబాబాను ఉంచడం అత్యంత దారుణం.

Eha Tv

Eha Tv

Next Story