ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో రేపు అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఏదో జరగబోతున్నది.. అది ఏమిటన్నది అత్యంత ఆసక్తిగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో రేపు అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఏదో జరగబోతున్నది.. అది ఏమిటన్నది అత్యంత ఆసక్తిగా మారింది. ఈ అమితాసక్తికి కారణం తెలుగుదేశం పార్టీ(TDP)కి చెందిన ఎక్స్‌ అకౌంట్‌నుంచి ఓ ట్వీ్‌ రావడమే! ' బిగ్ ఎక్స్‌పోజ్.. కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 PM.. స్టే ట్యూన్‌డ్' అంటూ తెలుగుదేశంపార్టీ ఓ ట్వీట్‌ చేసింది. రేపు మధ్యాహ్నం ఏం జరగబోతున్నది? టీడీపీ ఏం చెప్పబోతున్నది? అన్న విషయంపై రాజకీయ వర్గాలలో చర్చ మొదలయ్యింది. ఎక్స్‌పోజ్‌ అని అన్నారంటే ఏదో కీలకమైన అంశాన్నే చెప్పబోతున్నారని చాలా మంది భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందినిపిస్తోంది. అత్యంత కీలకమైనదంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్‌ చేస్తారేమో! తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు సంబంధించిన విషయం అయి ఉంటుందని కొందరు అంటున్నారు. టీడీపీ ఇలా సస్పెన్స్‌లో పెట్టేసి అసలు విషయం చెప్పడమన్నది ఇటీవల లోకేశ్‌ ట్వీట్‌తో మొదలయ్యింది. ఈ మధ్యన లోకేశ్‌(Lokesh) కూడా ఇలాగే సస్పెన్స్‌లో పెడుతూ ఓ ట్వీట్ చేశారు. తర్వాత ఏపీ(AP)లో టీసీఎస్‌(TCS) పెట్టుబడుల ప్రకటన చేశారు. ఇప్పుడు కూడా బిగ్‌ ఎక్స్‌పోజ్‌ అంటున్నారంటే ఏదో విషయాన్ని బయటపెట్టనుందని అనుకోవాలి. మరోవైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ(YSRCP) కూడా ఇదే రకమైన ట్వీట్‌ చేసింది. మొత్తం మీద రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాజకీయాలలో సంచలనం జరగబోతున్నది. అదేమిటన్నది తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే!

ehatv

ehatv

Next Story