అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్ర‌శ్నించారు. ఆదివారం జిల్లా నేతల టెలికాన్ఫరెన్స్ లో ఆయ‌న మాట్లాడుతూ.. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ వంటి ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా మోదీ, అమిత్ షా కలిశారు కదా?

అమిత్ షా(Amith Shah), జేపీ నడ్డా(JP Nadda)లను చంద్రబాబు(Chandrababu) కలిస్తే తప్పేంటి? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ప్ర‌శ్నించారు. ఆదివారం జిల్లా నేతల టెలికాన్ఫరెన్స్ లో ఆయ‌న మాట్లాడుతూ.. గతంలో మమతా బెనర్జీ(Mamata Benerjee), స్టాలిన్(Stalin), నితీష్(Nitish Kumar) వంటి ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా మోదీ, అమిత్ షా కలిశారు కదా? అని ప్ర‌శ్నించారు. ప్రతిపక్షాలను, ప్రజలను కలవకుండా కేసీఆర్(KCR) మాదిరిగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ బీజేపీ(BJP) కాదని అన్నారు. టీడీపీ(TDP)తో బీజేపీ పొత్తు ఊహగానాలే.. ఊహాజనిత కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ అన్నారు.

Updated On 4 Jun 2023 4:21 AM GMT
Yagnik

Yagnik

Next Story