ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరే అంశమూ లేనట్టుగా అందరూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(MLC Duvvada srinivas) ఫ్యామిలీ అఫైర్లపై పడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరే అంశమూ లేనట్టుగా అందరూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(MLC Duvvada srinivas) ఫ్యామిలీ అఫైర్లపై పడ్డారు. దువ్వాడ కుటుంబ కథ ఇప్పుడు మీడియాకు ప్రధాన సరుకు అయ్యింది. ట్విస్టులంటూ, మలుపులంటూ రచ్చ రచ్చ చేస్తున్నది. దువ్వాడ శ్రీనివాస్‌ తన భార్యకు విడాకులు(divorce) ఇస్తానని చెప్పేంత వరకు మీడియా నిద్రపోలేదు. ఇదే సమయంలో తాను శ్రీనివాస్‌తోనే ఉంటానని, తమ బంధాన్ని అడల్టరీ(adultry) అంటారని ఆయన కుటుంబంలోకి ఎంటరైన మాధురి(Madhuri) చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చ రచ్చ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాటర్ ముదిరి పాకాన పడటంతో.. తన విచిత్రమైన కథకి విడాకులే ముగింపు అంటూ దువ్వాడ శ్రీనివాస్ డైరెక్ట్ గా చెప్పేశారు! ఇదే సమయంలో... తాను శ్రీనుతోనే కలిసి ఉంటానని, ఈ బంధాన్ని అడల్టరీ అంటారని మాధురి తెలిపారు. ఎవరీ మాధురి అంటే ఈ విషయాన్ని దువ్వాడే చెప్పుకొచ్చారు. ఆమె ఒక డాన్స్‌ టీచరట(Dance teacher)! ఆమెను దువ్వాడకు పరిచయం చేసింది ఆయన భార్య వాణినేనట! తనకూ, మాధురికి మధ్య వాణి లేనిపోనివి అంటకట్టిందని ఆయన బాధపడుతున్నారు. వాణి మాటల వల్ల మాధురి ఒకానొక సమయంలో ఆత్మహత్యకు(suicide) కూడా ప్రయత్నించారట! తన కుటుంబం కారణంగా చనిపోవాలనుకున్న అమ్మాయికి తాను దగ్గరయ్యానని, కలిసి తిరిగానని దువ్వాడ శ్రీనివాస్‌ చెప్పారు. రెండేళ్లుగా తాను వాణితో దూరంగా ఉంటున్నానని, తనను అసలు పట్టించుకోలేదని వివరించారు. తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని, త్వరలోనే నోటీసులు ఇస్తారని తెలిపారు. తన కూతుళ్లను చూసుకునే బాధ్యత తనదేనన్నారు. వాణిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందని.. ఆమె నుంచి తనను రక్షించాలని కోరారు.

మాధురి కూడా ఇలాగే చెప్పారు. తాను శ్రీనివాస్‌ను ట్రాప్‌ చేశానని వాణి చేస్తున్న ఆరోపణలలో వీసమెత్తు నిజం కూడా లేదన్నారు. తన దగ్గర ఏముందని ట్రాప్‌ చేస్తానని ప్రశ్నిస్తున్నారు. ఆరు నూరైనా, నూరు ఆరైనా శ్రీనివాస్‌తోనే కలిసి ఉంటానని చెప్పేశారు. చనిపోదామనుకున్న సమయంలో తనకు శ్రీనివాస్‌ అండగా నిలిచారని, అప్పట్నుంచి ఓ ఫ్రెండ్‌లా, కేర్‌టేకర్‌లా, గైడ్‌లా తనకు అండగా నిలిచారని అన్నారు. మాధురి అప్పుడప్పుడు రీల్స్‌ చేస్తుంటారు. వీటిని తన ఇస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. అప్పుడేప్పుడో ఖడ్గం సినిమాలోని అల్లరి అల్లరి చూపులతో పాట ట్యూన్ కి ఆమె డ్యాన్స్ చేస్తున్న ఓ రీల్‌ను నెటిజన్లు ఇప్పుడు బయటకు తీసి వైరల్ చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story