ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 సదస్సు లో భాగంగా మాట్లాడుతూ సీఎం స్పష్టతను ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన విశాఖ దేశంలోనే ప్రముఖ నగరాలతో పోటీపడే విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందన్నారు, విశాఖ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి విశాఖ అనువైన […]

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 సదస్సు లో భాగంగా మాట్లాడుతూ సీఎం స్పష్టతను ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన విశాఖ దేశంలోనే ప్రముఖ నగరాలతో పోటీపడే విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందన్నారు, విశాఖ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి విశాఖ అనువైన ప్రాంతమని త్వరలో ఇక్కడ నుండే పరిపాలన ఉంటుందని సిఎం జగన్ పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో విశాఖ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగుతుందని సీఎం అన్నారు.

Updated On 3 March 2023 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story