అత్తింటి ఆరళ్ళు ,భర్త నిర్లక్ష్యం రెండింటితో విసిగిపోయిన మహిళ తను ప్రాణాలతో ఉండి ఏం ప్రయోజనం అనుకుంది . బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడింది . ఆడపిల్లకు పెళ్ళయ్యాక అత్తారిల్లే లోకం భర్తే ప్రాణం కానీ వారే నిర్లక్ష్యం చేస్తే ,కన్నవారితో చెప్పుకోలేక ,కలిసి జీవించలేక ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడుతున్న ఆడపిల్లలు ఎంతోమంది మన కళ్ళముందే ఉన్నారు . తాజాగా వైజాగ్ లోని యువతి కుటుంబసమస్యలతో ఆత్మహత్యకు పాల్పడింది . ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఒక లెటర్ రాసింది . బీచ్ లో శవమై తేలింది .అసలు ఏమి జరిగింది అంటే ?

అత్తింటి ఆరళ్ళు ,భర్త నిర్లక్ష్యం రెండింటితో విసిగిపోయిన మహిళ తను ప్రాణాలతో ఉండి ఏం ప్రయోజనం అనుకుంది . బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడింది . ఆడపిల్లకు పెళ్ళయ్యాక అత్తారిల్లే లోకం భర్తే ప్రాణం కానీ వారే నిర్లక్ష్యం చేస్తే ,కన్నవారితో చెప్పుకోలేక ,కలిసి జీవించలేక ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడుతున్న ఆడపిల్లలు ఎంతోమంది మన కళ్ళముందే ఉన్నారు . తాజాగా వైజాగ్ (vizag)లోని యువతి కుటుంబసమస్యలతో ఆత్మహత్యకు పాల్పడింది . ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఒక లెటర్ రాసింది . బీచ్ లో శవమై తేలింది .అసలు ఏమి జరిగింది అంటే ?

గత ఏడాది పెదగంట్యాడ మండలం పెదనడుపూరు(peda nadupuru) ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జి. మణికంఠకు(Manikanta) శ్వేతనిచ్చి(swetha) పెద్దలు ఘనంగా వివాహం చేసారు . శ్వేతకు తండ్రి లేరు .తల్లి రమ (rama)విశాఖ రైల్వే ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తుంది . వివాహం సమయంలో కట్నకానుకలు ఇచ్చి వైభవంగా కూతురిని అత్తారింటికి పంపించారు . పెళ్ళైన కొన్ని రోజులు అంత బాగానే ఉంది . అత్తగారు ,ఆడపడుచుల పోరువలనే తన కూతురికి ఇలాంటి గతి పట్టిందని ఆరోపిస్తుంది శ్వేత తల్లి . తన కూతురు రూపంలో గుణంలో లక్ష్మి దేవి లాంటిదని తను సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని ఎంతో పట్టుదలతో ఉండేదని కానీ పెళ్లయ్యాక వంటింటికే తన కూతురిని పరిమితం చేసారని వాపోయింది . ఇచ్చిన కట్నం సరిపోక అదనపు కట్నం కోసం అత్త ,ఆడపడుచు తరచూ వేధించేవారని మంగళవారం అంటే శ్వేత కనిపించకుండా పోయిన రోజు కూడా తల్లికి ఫోన్ చేసి తన భాదను చెప్పుకున్నట్లు తెలిపింది .

మంగళవారం రోజు ఇంట్లో జరుగుతున్న గొడవల విషయం పైన భర్తతో ఫోన్లో చాల సేపు మాట్లాడింది శ్వేత. శ్వేత ఆత్మహత్య కు పాల్పడే రోజున భర్త ఊరిలో లేడు . పని మీద హైదరాబాద్ వెళ్ళాడు . భర్తతో చాల సేపు వాగ్వివాదం చేశాక నీకు భార్య పిల్లలు అక్కరలేదు అంటూ ఆవేశంగా ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసింది శ్వేత .ఇంట్లో వాళ్ళు ఆసుపత్రి పని మీద బయటకు వెళ్లడంతో రాత్రి 7 గంటల ప్రాంతంలో శ్వేత ఒక లెటర్ రాసి ఇంటికి తాళం వేసి తాళాలు పక్కింట్లో ఇచ్చి మొబైల్ కూడా ఇంట్లోనే వదిలేసి బయటకు వెళ్ళిపోయింది . వెళ్లేసమయంలో బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నట్లు స్థానికులు చెపుతున్నారు . ఇంటికి వచ్చిన తరువాత శ్వేత అత్తింటివాళ్ళు లెటర్ చూసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది . కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలియగానే భర్త మణికంఠ హుటాహుటిన హైదరాబాద్ నుండి వైజాగ్ బయలుదేరివచ్చాడు . శ్వేత ఆచూకీ తెలియకపోవడంతో మొదట మిస్సింగ్ కేసుగా ఈ ఫైల్ ని నమోదు చేయగా రాత్రి 2 గంటల ప్రాంతలో ఒక గుర్తుతెలియని శవం rk బీచ్ లో లభించింది . ఆ శవం శ్వేతదే అని నిర్దారించారు కానీ శవం ఇసుకలో కూరుకుపోయి కేవలం లోదుస్తులతో మాత్రమే ఉండటంతో ఇది హత్య!లేక ఆత్మహత్య! అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి . శ్వేత ఒంటిమీద ఎలాంటి గాయాలు లేవు . పోస్ట్ మార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉంది నివేదిక ప్రకారం విచారణ చేపట్టనున్నారు పోలీసులు . ప్రస్తుతం శ్వేతా 5 నెలల గర్భిణీ .శ్వేత మరణంతో ఆమె తల్లి రమ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది .

భర్త మణికంఠ మాత్రం శ్వేత ఫోన్లో మాట్లాడుతున్నపుడే నచ్చచెప్పడానికి చాల ప్రయత్నించాను అని కానీ శ్వేత వినకుండ ఫోన్ కట్ చేసిందని ,కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది ,ఇంత దారుణానికి పాల్పడుతుందని అసలు ఊహించలేదని ,ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాక చాలా కాల్స్ ,మెసేజెస్ పెట్టిన ప్రయోజనం లేకపోయిందని చెప్పాడు .

శ్వేత రాసిన సూసైడ్ నోట్ లో ఏమి రాసి ఉందంటే ...

నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం బాధ ఉండదని. ఏదేమైనా ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ యువర్‌ ఫ్యూచర్‌.. న్యూ లైఫ్‌. చాలా మాట్లాడటానికి ఉన్నా కూడా.. నేను ఏమీ మాట్లాడడంలేదు. యూ నో ఎవ్రిథింగ్‌. జస్ట్‌ క్వశ్చన్‌ యువర్‌ సెల్ఫ్‌' అంటూ శ్వేత సూసైడ్‌ లేఖలో రాసి ఉంది. 'ఏ బిగ్‌ థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రిథింగ్‌' అంటూ స్మైలీ బొమ్మ వేసిన ఆ లేఖను శ్వేత గదిలో పోలీసులు గుర్తించారు.

Updated On 27 April 2023 12:44 AM GMT
rj sanju

rj sanju

Next Story