నేటి నుంచి ఉమ్మడి చిత్తూరుజిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించ‌నున్నారు. ఈ రోజు నుంచి 23వరకు ఉమ్మడి చిత్తూరుజిల్లాలో భువనేశ్వరి పర్యటన కొన‌సాగుతుంది.

నేటి నుంచి ఉమ్మడి చిత్తూరుజిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించ‌నున్నారు. ఈ రోజు నుంచి 23వరకు ఉమ్మడి చిత్తూరుజిల్లాలో భువనేశ్వరి పర్యటన కొన‌సాగుతుంది. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జిడి నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు భువనేశ్వరి వెళ్ల‌నున్నారు. 4 రోజుల్లో 15మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు చ‌చొప్పున‌ ఆర్థికసాయం అందించనున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 21న కుప్పం నియోజకవర్గంలో మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్నారు.

Updated On 19 Feb 2024 7:59 PM GMT
Yagnik

Yagnik

Next Story