రోడ్డు ప్రమాదంలో(Road accident) కుమారుడి మృతినమ్మలేక మృతదేహంతోనే తల్లి మాట్లాడడం చూసి అక్కడ ఉన్నవారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో(Road accident) కుమారుడి మృతినమ్మలేక మృతదేహంతోనే తల్లి మాట్లాడడం చూసి అక్కడ ఉన్నవారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై కుమారుడి పక్కన పడుకుని బాబు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకొడుతోంది. బాబు లేచిన తర్వాతే ఇంటికి వెళ్దామని భర్తతో చెప్తోంది. బాబు లేచిన తర్వాత అందరం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్దామని మారం చేసింది. కానీ ఐదేళ్ల పసిబాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి(Death) చెందాడని ఎంత మంది చెప్పినా లేదు నా కొడుకు లేచి వస్తాడన్న భ్రమతో కుమారుడితో సంభాషిస్తూనే ఉంది.

కంటతడి పెట్టించిన ఈ అన్నమయ్య జిల్లా(Annamaya District) రాజంపేటలో(Rajam Peta) జరిగింది. ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడుకు చెందిన శిరీష, బాబూరాం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడికి అనారోగ్యం కావడంతో పిల్లలిద్దరు, తల్లిదండ్రులు కలిసి బైక్‌పై రాజంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్‌ అదుపుతప్పి కింద పడిపోయారు. ముందు కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్‌ రోడ్డుపై పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి బెడ్‌పై శ్యామ్ మృతదేహాన్ని ఉంచగా తల్లి పక్కనే పడుకొని కన్నా.. లే నాన్నా.. ఇంకా ఎంత సేపు పడుకుంటావని.. నిద్రలేవు అని పిలుస్తోంది. భర్త చెప్పినా వినకుండా.. కన్నయ్య లేచిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పడంతో భార్యకు ఎలా చెప్పాలో తెలియక భర్త రోదించసాగాడు. అక్కడ ఉన్న స్థానికులను కూడా ఈ ఘటన కంటతడి పెట్టించింది.

Eha Tv

Eha Tv

Next Story