ఎవరో చెప్పిన మాటలు విని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరికాదని

ఎవరో చెప్పిన మాటలు విని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరికాదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. నారా భువనేశ్వరిని నేను ఎప్పుడూ ఒక్కమాట కూడా అనలేదన్నారు. లోకేష్ నన్ను, నా కుంటుంబ సభ్యులపై ఐటీడీపీతో సోషల్ మీడియాలో వార్తలు రాయించాడని.. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని లోకేష్‌కు చెప్పానన్నారు. నేను అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడానని పవన్ అంటున్నారని.. ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేనన్నారు. ఐఎస్‌బీ మొహాలీలో కోర్సు కోసం పంజాబ్‌లో ఉన్నానని వివరించారు. ఎవరో చెప్పిన మాటలు విని పవన్ మాట్లాడటం సరికాదని.. నేను అనని మాట కూడా నాకు ఆపాదించారు.. నేను ఎవరినీ ఏమీ అనకపోయినా క్షమాపణ చెప్పానన్నారు వంశీ.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం పార్లమెంట్‌లో పెట్టిందని.. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రాలు అంగీకరించాల్సిందేనని వల్లభనేని వంశీ అన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదని.. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదన్నారు వంశీ.

Updated On 9 May 2024 9:43 PM GMT
Yagnik

Yagnik

Next Story