విశాఖపట్నంలో(Vizag) విద్యార్థులు(students) రెచ్చిపోయారు

విశాఖపట్నంలో(Vizag) విద్యార్థులు(students) రెచ్చిపోయారు. బాజీ జంక్షన్ సమీపంలో రెండు గ్రూపుల మ‌ధ్య భీక‌ర‌మైన పోరు జ‌రిగింది. ఒక‌రిపైఒక‌రు పిడిగుద్దుల‌తో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్(traffic jam) ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా మంది వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డ్డారు. ఈ ఘటనపై పలువురు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు విసురుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘర్షణ వెనుక కారణాలు తెలియాల్సివుంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఘర్షణకు పాల్పడిన విద్యార్థులను గుర్తించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

నడి రోడ్డు పై ఇటువంటి ఘటన జరగటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణకు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యాల‌ను కోరారు.

Eha Tv

Eha Tv

Next Story