టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందిగా ఉందని.. ఆయ‌న‌కు ప్రాణ హాని ఉందని తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్(Hyderabad) లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నిన్న భువనేశ్వరి(Nara Bhuvaneshwari)ని కలిసి సంఘీభావం తెలిపామన్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందిగా ఉందని.. ఆయ‌న‌కు ప్రాణ హాని ఉందని తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్(Hyderabad) లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నిన్న భువనేశ్వరి(Nara Bhuvaneshwari)ని కలిసి సంఘీభావం తెలిపామన్నారు. చంద్రబాబుకు సరైన వైద్య సదుపాయాలు లేవని.. ఆయ‌న‌కు ప్రాణ హాని జరిగితే ముఖ్యమంత్రి జగన్(CM Jagan) దే బాధ్యత అని అన్నారు.

చంద్రబాబుకు కావాల్సిన వైద్య సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం లో విఫలం అయిందన్నారు. చంద్రబాబుకు స్పెషల్ గా మెడికల్ టీం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని.. ఆయ‌న‌ను ఓ టెర్రరిస్ట్ లా ప్రభుత్వం ట్రీట్ చేస్తుందని ఆరోపించారు. అన్ని ప్రాంతాల్లో చంద్రబాబుకు మద్దతు ఉంద‌న్నారు. జగన్ సర్కార్ ప్రతి విషయంలో విఫలం అయ్యింద‌ని.. కేవలం అరెస్ట్ లు, భయబ్రాంతులకు గురి చేస్తూ పాలనా సాగిస్తున్నార‌ని అన్నారు.

త్వ‌ర‌గా చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని జగన్ అన్యాయంగా అరెస్ట్ చేశారని సామాన్య ప్రజలు ఆవేదన వ్య‌క్తప‌రుస్తున్నార‌ని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు విషయంలో చొరవ తీసుకోవాలని తెలంగాణ తెలుగుదేశం తరపున డిమాండ్ చేశారు.

జగన్ కేవలం కక్ష సాధింపు చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు విషయం లో ప్రభుత్వం సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే పరిస్థితి దారుణంగా తయారు అవుతుందని అన్నారు. ఊహకు అందని తీరులో చంద్రబాబును ట్రీట్ చేస్తున్నారు.. జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయ‌ని అన్నారు."Written By : Senior Journalist M.Phani Kumar"

Updated On 17 Oct 2023 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story