తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది . నడక దారిన తిరుమల చేరుకొనే భక్తులు స్వామివారి దర్శనము త్వరగా జరిగేలా దివ్య దర్శనం టోకెట్లు ఇవ్వాలని టీ టీ డి నిర్ణయించింది.అలిపిరి,శ్రీవారిమెట్టు మార్గం గుండా నిత్యం వేలాది భక్తులు తిరుమలకు చేరుకోగా వీరిలో చాల మంది భక్తుల వద్ద దర్శన టికెట్లు లేకపోవడం గమించిన టీ టీ డి నడకదారిని వచ్చేవాళ్ళకి కూడా దివ్య దర్శనం టికెట్స్ జారీ చేయాలనీ నిర్ణయించింది. దీని […]

తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది . నడక దారిన తిరుమల చేరుకొనే భక్తులు స్వామివారి దర్శనము త్వరగా జరిగేలా దివ్య దర్శనం టోకెట్లు ఇవ్వాలని టీ టీ డి నిర్ణయించింది.అలిపిరి,శ్రీవారిమెట్టు మార్గం గుండా నిత్యం వేలాది భక్తులు తిరుమలకు చేరుకోగా వీరిలో చాల మంది భక్తుల వద్ద దర్శన టికెట్లు లేకపోవడం గమించిన టీ టీ డి నడకదారిని వచ్చేవాళ్ళకి కూడా
దివ్య దర్శనం టికెట్స్ జారీ చేయాలనీ నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు . అది పూర్తి అయిన వెంటనే టోకెన్ల జారీ ప్రారంభిస్తామని ఈవో చెప్పడం జరిగింది. శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన వారికి తిరుమలలోని ఎస్‌ఎన్‌జీహెచ్‌, ఏటీజీహెచ్‌ అతిథి గృహాల్లో 88 గదులు కేటాయించనున్నట్లు కూడా తెలిపారు.

టీటీడీ డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్‌ మొదటి వారానికి ధర్మరథం బస్సుల స్థానంలో మరో 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తునట్లు ప్రకటించటం జరిగింది . తిరుమలలో మార్చి 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. తిరుమలలో దళారీల బెడద తగియించే ఉద్దేశ్యం తో నూతన విధానాలను అందుబాటులోకి టీ టీ డి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది . శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్‌ చెల్లింపునకు ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది.

Updated On 4 March 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story