తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లు నిండిపోయాయి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 నుంచి 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. శుక్రవారం నాడు స్వామివారిని 63,830 మంది భక్తులు దర్శించుకోగా 30,810 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.20 ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

కార్వేటి నగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 1.30 నుండి ఆలయంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. పుష్పయాగం అనంతరం రాత్రి 7 నుంచి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

Updated On 8 Jun 2024 1:56 AM GMT
Yagnik

Yagnik

Next Story