తిరుపతి(Tirupathi) జిల్లా ఏర్పేడులో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జ‌రిగింది. ఆర్టీసీ(RTC) బస్సును కారు(CAR) ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా.. తీవ్రంగా గాయ‌ప‌డిన‌ మరో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది.

తిరుపతి(Tirupathi) జిల్లా ఏర్పేడులో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జ‌రిగింది. ఆర్టీసీ(RTC) బస్సును కారు(CAR) ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా.. తీవ్రంగా గాయ‌ప‌డిన‌ మరో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి -శ్రీకాళహస్తి(Sri Kalahasthi) ప్రధాన రహదారిలో(High way) ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఘటన జ‌రిగింది. మృతుల్లో భార్యాభర్తల‌తో పాటు చిన్నారి పాప ఉంది. ప్ర‌మాదంపై స‌మాచారం అందిన వెంట‌నే ఏర్పేడు సీఐ శ్రీహరి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేప‌ట్టారు. మృతులు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికు చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. గాయ‌ప‌డిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 1 Jun 2023 4:06 AM GMT
Ehatv

Ehatv

Next Story