పల్నాడు(Palnadu) జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామంలో అర్థరాత్రి ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన సాంబశివరావు, ఆదిలక్ష్మి, నరేశ్‌లను సమీప బంధువులే విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపేశారు.

పల్నాడు(Palnadu) జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామంలో అర్థరాత్రి ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన సాంబశివరావు, ఆదిలక్ష్మి, నరేశ్‌లను సమీప బంధువులే విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. కొంతకాలంగా భార్య మాధురిని భర్త నరేశ్‌, అత్తమామలు ఆదిలక్ష్మి, సాంబశివరావు, వేధిస్తున్నట్టు సమాచారం. హత్యల తర్వాత మాధురితో పాటు సహ బంధువులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 23 Nov 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story