తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం వినగడపలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని, చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని కేశినేని నాని జోస్యం చెప్పారు. ధనికుల కోసం, పనికిమాలిన కొడుకు కోసం, పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు కేశినేని నాని. రాబోయే ఎన్నికల్లో మనం నొక్కే బటన్ దెబ్బకు ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవాలని ప్రజలు కేశినేని పిలునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ […]

తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం వినగడపలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని, చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని కేశినేని నాని జోస్యం చెప్పారు. ధనికుల కోసం, పనికిమాలిన కొడుకు కోసం, పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు కేశినేని నాని. రాబోయే ఎన్నికల్లో మనం నొక్కే బటన్ దెబ్బకు ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవాలని ప్రజలు కేశినేని పిలునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కేసుపెడతారని అర్ధరాత్రి తెలంగాణ నుంచి ఏపీకి చంద్రబాబు పారిపోయి వచ్చాడని గుర్తు చేశారు. ఇప్పుడు జగనన్న దెబ్బకు ఏపీ నుంచి తెలంగాణ పారిపోవడం ఖాయమని అన్నారు.

అధికారం లోకి రావాలని చంద్రబాబు, ఆయన పనికిమాలిన కొడుకు కలలు కంటున్నారని మండిపడ్డారు. టీడీపీ పార్టీ పని అయిపోయిందని, అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు. ఇక్కడ సీట్లను అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ పోతారన్నారు. 2024 ఎన్నికలవ్వగానే మేలో ఫలితాలొస్తాయని, ఫలితాలు రాగానే చంద్రబాబు, లోకేష్ వాళ్ల సొంత రాష్ట్రం తెలంగాణ పోవడం ఖాయమన్నారు.టీడీపీ పార్టీకి గ్రౌండ్ లెవల్లో పనిచేసే వారియర్స్ ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. తన చిన్నప్పుడు ఎన్టీఆర్ సభల్లో చూసినంత జనం ‘సిద్ధం’ సభలో చూశానని తెలిపారు. గుడివాడలో చంద్రబాబు సభ పెడితే 3 వేల మంది కూడా రాలేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం పనిచేసే వ్యక్తి అని కేశినేని నాని తెలిపారు.

Updated On 4 Feb 2024 5:00 AM GMT
Yagnik

Yagnik

Next Story