ఈ టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్లను కూడా ఈరోజే విడుదల చేయనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి ఈ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు ఒక గుడ్ న్యూస్ . జూలై నెల కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్ ‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి.

అయితే ఈ టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్లను కూడా ఈరోజే విడుదల చేయనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి ఈ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఇక శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్‌లైన్‌ కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.

ఇక శుక్రవారం, ఏప్రిల్ 21 న అంగప్రదక్షిణం టోకెన్లను(Tokens) రిలీజ్‌(release) చేయనున్నారు. జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల ను రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో(Online) అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటా టికెట్లు ఏప్రిల్‌ 24న ఉదయం 10 గంటలకు, జూన్‌ నెల కోటా టికెట్లు ఏప్రిల్‌ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ కానున్నాయి. మే, జూన్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్‌ 25న ఉదయం 10 గంటలకు, తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్‌ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్‌ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.

Updated On 20 April 2023 12:26 AM GMT
madhuri p

madhuri p

Next Story