కర్నూలు (Kurnool) జిల్లా కౌతాళం (Kouthalam) మండలం హాల్విలో (Halvi) విషాదం చోటుచేసుకుంది. రామకృష్ణ (Ramakrishna), శారద (Sharada) అనే దంపతులకు ఇద్దరు కుమారులు వెంకటేష్‌ (3), భరత్‌ (6 నెలలు) ఉన్నారు

కర్నూలు (Kurnool) జిల్లా కౌతాళం (Kouthalam) మండలం హాల్విలో (Halvi) విషాదం చోటుచేసుకుంది. రామకృష్ణ (Ramakrishna), శారద (Sharada) అనే దంపతులకు ఇద్దరు కుమారులు వెంకటేష్‌ (3), భరత్‌ (6 నెలలు) ఉన్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భర్త బయటకు వెళ్లిన సమయంలో తన ఇద్దరు కుమారులను చంపేసింది. అభంశుభం తెలియని చిన్నారులను నీటి బకెట్‌లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసింది.

కన్న కొడుకులను చంపేసినట్లు ఇంట్లో తెలిస్తే తనను వదిలిపెట్టారని పురుగుల మందు తాగి తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు భర్తకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని (Adoni) ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే శారద తన పిల్లలను చంపేందుకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఆమె కోలుకున్న తర్వాత పూర్తి విచారణ చేపడతామని తెలిపారు.

Updated On 30 Dec 2023 11:11 PM GMT
Ehatv

Ehatv

Next Story