చంద్ర‌బాబుకు(Chandrababu) ఐటీ శాఖ‌ నోటీసులు(IT Notices) ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే.. యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న టీడీపీ(TDP) జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌(Nara Lokesh) భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయ‌న‌కూ భీమవరం పోలీసులు(Bhimavaram Police) నోటీసులు ఇచ్చారు.

చంద్ర‌బాబుకు(Chandrababu) ఐటీ శాఖ‌ నోటీసులు(IT Notices) ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే.. యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న టీడీపీ(TDP) జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌(Nara Lokesh) భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయ‌న‌కూ భీమవరం పోలీసులు(Bhimavaram Police) నోటీసులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్ప‌డ్డారు.

లోకేశ్ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్‌ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు దానిని తొలగించడానికి ప్రయత్నించారు. వైఎస్ వివేకాను చంపింది ఎవరంటూ.. ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఇటీవ‌ల‌ చంద్రబాబు పుంగనూరు ప‌ర్య‌ట‌న‌లో కూడా టీడీపీ శ్రేణుల‌కు, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య గొడవ జ‌రిగింది.

Updated On 6 Sep 2023 2:39 AM GMT
Ehatv

Ehatv

Next Story