తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి మద్దతు ఇవ్వబోతున్నారని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాగూర్ ఫిబ్రవరి 19న మీడియాకు తెలిపారు. రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం.. వైసీపీకి నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల ప్రచారం చేస్తున్నప్పటికీ.. పెద్దగా ఆమెకు మద్దతు రావడం లేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరుతున్నారు. తన పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పెద్దలను ఆయన కలవనున్నారు. లోక్ సభ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఇప్పటికే లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఓ ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక కేబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్ లో చోటు దక్కలేదు. దీంతో, మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

Updated On 19 Feb 2024 1:45 AM GMT
Yagnik

Yagnik

Next Story