చంద్రబాబు తనకు దేవుడని, ప్రాణం ఉన్నంత వరకూ ఆయనకు విధేయుడిగా ఉంటానని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం అంటే చాలు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఏమి చేయడానికైనా సిద్ధమని అంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పని అందరికీ షాక్ ఇచ్చేస్తోంది. ఆదివారం నాడు చంద్రబాబు నాయుడు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం చేశారు. తన శరీరంలో నుంచి రక్తం తీసి చంద్రబాబు కటౌట్ పాదాలకు అభిషేకం చేయడంతో పాటు గోడపై సీబీఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే.. అంటూ రాశారు.

చంద్రబాబు తనకు దేవుడని, ప్రాణం ఉన్నంత వరకూ ఆయనకు విధేయుడిగా ఉంటానని బుద్దా వెంకన్న చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశానని అన్నారు. అనకాపల్లి పార్టీ టికెట్ విషయంలో ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయని, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం విషయంలో ఎవరి పేర్లూ వినిపించడంలేదన్నారు. రాష్ట్రంలో, దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడబోతున్నాయని, కీలకమైన విశ్వాసపాత్రులైన వారికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానానికి సూచించారు. తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ‘జై చంద్రబాబు’ అనే అంటానని, చంద్రబాబుపై ఎవరు విమర్శలు చేసినా ఊరుకోబోనని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తనకు దేవుడితో సమానమని.. ప్రాణం ఉన్నంత వరకూ ఆయనకు విధేయుడిగా ఉంటానని అన్నారు.

Updated On 18 Feb 2024 6:54 AM GMT
Yagnik

Yagnik

Next Story