తెలుగుదేశం పార్టీ(TDP) అధినాయకత్వానికి జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) కంట్లో నలుసులా తయారయ్యారు. తారక్‌ను వదిలేసుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా కావడం లేదు. తాజాగా పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా ఆచంట, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో టీడీపీ ఆధ్వర్యంలో రా... కదలిరా పేరిట సభలు నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ(TDP) అధినాయకత్వానికి జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) కంట్లో నలుసులా తయారయ్యారు. తారక్‌ను వదిలేసుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా కావడం లేదు. తాజాగా పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా ఆచంట, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో టీడీపీ ఆధ్వర్యంలో రా... కదలిరా పేరిట సభలు నిర్వహించారు. వీటికి హాజరైన జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఫ్యాన్స్‌ తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, జెండాలను లాగేసుకున్నారు. అక్కడి నుంచి వారిని తరిమేశారు. ఆచంటలో(Achanta) వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన(Janasena) కార్యకర్తలపైన కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి దిగడం ఆశ్చర్యం! ఈ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు జై ఎన్టీఆర్‌, జై జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ఇదేసమయంలో జనసేన అభిమానులు కూడా వారి పార్జీ జెండాలతో అక్కడికి వచ్చారు. వారి చేతుల్లోని జెండాలను కూడా టీడీపీ శ్రేణులు లాగేసుకున్నారు.

Updated On 8 Jan 2024 5:04 AM GMT
Ehatv

Ehatv

Next Story