వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి(Jagan Mohan reddy) మంత్రి నారా లోకేశ్‌(Nara lokesh) ఘాటైన రిప్లై ఇచ్చారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి(Jagan Mohan reddy) మంత్రి నారా లోకేశ్‌(Nara lokesh) ఘాటైన రిప్లై ఇచ్చారు. 74 ఏళ్ల వయసులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం చేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడానికి మనసెలా వచ్చిందని నిలదీశారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఓ పోస్ట్ పెట్టారు లోకేశ్‌. 'ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా జగన్? బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన మీరు బెంగుళూరు ప్యాలస్ లో రిలాక్స్ అవుతూ 74 ఏళ్ల వయస్సు లో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబు గారి పై విమర్శలు చెయ్యడానికి మనస్సు ఎలా వచ్చింది. విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదు..పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందే! నాడు చంద్రబాబు(Chandrababu) గారు బుడమేరు ఆధునీకరణకు రూ.464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే మీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణం అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్.

ఆధునీకరణ, మరమ్మత్తుల పనులు ఆపేసారు. సుమారుగా రూ.500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసిపి నాయకులు కబ్జా చేశారు. 2022 లోనే గండి పడినా పట్టించుకోలేదు. 5 ఏళ్ళలో సరైన నిర్వహణ లేదు. విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేసారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలు. అన్ని సమస్యలను అధిగమిస్తాం. చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకూ విశ్రమించం' అని లోకేశ్‌ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story