హైదరాబాద్(Hyderabad) నుంచి గన్నవరం(Gannavaram) విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh), ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ ప్రశాంత్ కిషోర్(Prashanth Kishore) క‌లిసి ద‌ర్శ‌న‌మిచ్చారు.

హైదరాబాద్(Hyderabad) నుంచి గన్నవరం(Gannavaram) విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh), ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ ప్రశాంత్ కిషోర్(Prashanth Kishore) క‌లిసి ద‌ర్శ‌న‌మిచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ(YCP) గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్.. లోకేష్ ప‌క్క‌న‌ క‌న‌ప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో(Social media) వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం వైసీసీకి ఐ-ఫ్యాక్ సేవ‌లందిస్తుంది. ఒక్కసారిగా గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వెంట కనిపించటంతో వైసీపీ నాయకులు, శ్రేషులు షాక్‌లో ఉన్నారు. నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఓకే వాహనంలో ఎక్కి రోడ్డు మార్గాన విజయవాడకు వెళ్లిన‌ట్లు చెబుతున్నారు. ఇరువురు క‌లిసి టీడీపీ అధినేత చంద్రబాబు ద‌గ్గ‌రికి వెళ్లిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సివుంది. వీరి భేటీపై మంత్రి అంబ‌టి రాంబాబు సెటైర్ సంధించారు. మెటీరియ‌లే మంచిది కాక‌పోతే మేస్త్రీ ఏం చేస్తాడ‌ని ఎద్దేవా చేశారు.

Updated On 23 Dec 2023 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story