ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో(AP Politics) ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో(AP Politics) ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇది హైదరాబాద్‌లో జరగడం మరో విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar redy) సతీమణి వై.ఎస్‌.విజయమ్మను(YS Jayamma) టీడీపీ(TDP) నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో(Lotus Pond) విజయమ్మ ఇంటికి వెళ్లి ప్రభాకర్‌రెడ్డి కలిశారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. ఈ భేటి వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని, మామూలుగానే కలిశామని జేసీ అన్నారు. వైఎస్‌ ఉన్నప్పుడు జేసీ కుటుంబం కాంగ్రెస్‌లో ఉండింది. వైఎస్‌ కేబినెట్‌లో జేసీ దివాకర్‌రెడ్డి మంత్రిగా కూడా పని చేశారు.

Eha Tv

Eha Tv

Next Story