టీడీపీ శ్రేణులు జనసేన నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డారు. బ్యానర్ చించార‌నే కార‌ణంతో టీడీపీ నేతలు జనసేన కార్య‌క‌ర్త‌ల‌ను చితక బాదారు

టీడీపీ శ్రేణులు జనసేన నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డారు. బ్యానర్ చించార‌నే కార‌ణంతో టీడీపీ నేతలు జనసేన కార్య‌క‌ర్త‌ల‌ను చితక బాదారు. ఈ ఘ‌ట‌న మచిలీపట్నం పరాసుపేటలో జ‌ర‌గ‌గా.. అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు అభ్యంతరం తెలిపారు. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్‌ను చించేశారు. దీంతో నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దాడిలో నానికి గాయాలు కాగా.. ఇల్లంతా ధ్వంసం అయ్యింది. ఈ విష‌య‌మై ఇరువర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్ మెంట్ కూడా చేశారు.

సెటిల్ మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి టీడీపీ నేత‌లు నాని ఇంటిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును కూడా రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. బ్యానర్ చించినందుకు టీడీపీ నేత‌లు కాళ్లు పట్టించుకుని మ‌రీ క్షమాపణ చెప్పించుకున్నారు. టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావులు క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఘ‌ట‌నపై ఒకరిపై ఒకరు జనసేన, టీడీపీ నేతలు చిలకలపూడి స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ గొడ‌వ‌కు సంబంధించి ఇరు పార్టీల పెద్ద‌ల స్పంద‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story