2024 లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నామ‌ని టీడీపీ(TDP) సీనియర్ నేత బుద్దా వెంకన్న(Budda Venkana) అన్నారు. తిరువూరులో చంద్రబాబు(Chandrababu) సభ నిర్వహణపై విజయవాడ వెస్ట్ నేతల సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేది చంద్రబాబు చెబుతారని అన్నారు. అందరం కలిసికట్టుగా పార్టీ గెలుపుకు పనిచేస్తామ‌ని తెలిపారు.

2024 లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నామ‌ని టీడీపీ(TDP) సీనియర్ నేత బుద్దా వెంకన్న(Budda Venkana) అన్నారు. తిరువూరులో చంద్రబాబు(Chandrababu) సభ నిర్వహణపై విజయవాడ వెస్ట్ నేతల సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేది చంద్రబాబు చెబుతారని అన్నారు. అందరం కలిసికట్టుగా పార్టీ గెలుపుకు పనిచేస్తామ‌ని తెలిపారు. తిరువూరులో చంద్రబాబు సభకి విజయవాడ నుంచి ర్యాలీగా(Rally) వెళ్తున్నామ‌ని తెలిపారు. టీడీపీలో పదవులు ఇవ్వటంతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. వైసీపీలో పదవులు ఇవ్వడమే కాదు.. ఆ నేతలకు గుర్తింపు తీసుకురావాలి. టీడీపీలో ఉన్న బీసీ నేతలకు వైసీపీలో ఉన్న బీసీ నేతలకు పోలిక లేదన్నారు.

వైసీపీలో ఒకరైన గుర్తింపు పొందిన బీసీ నేత ఉన్నారా.? అని ప్ర‌శ్నించారు. ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వటాన్ని మేము తప్పుపట్టం. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ పదవి కృష్ణయ్యకి ఎందుకివ్వ‌లేదు.? అని ప్ర‌శ్నించారు. టీడీపీ బీసీ నేతలకి ప్రయారిటీతో పాటు గౌరవం ఇస్తుందన్నారు. వైఎస్ కుటుంబాన్ని కొడాలి నాని(Kodali nani) గౌరవిస్తాడు తప్ప.. ఎన్టీఆర్ కుటుంబానికి గౌర‌వం ఇవ్వడన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే 100 దేశాలలో ఆందోళన చేశారని అన్నారు. కొడాలి నానిని ఏ దేశం వెళ్ళినా వదలరన్నారు. పందికొక్కులా ఇంట్లో ఉండి జగన్ జనం డబ్బులు తింటున్నాడని విమ‌ర్శించారు. నారా కుటుంబాన్ని విమర్శిస్తే మేం జగన్‌ను విమర్శిస్తామ‌న్నారు. జగన్‌ను తిట్టించాలని ఉంటే వైసీపీ నేతలు మమ్మల్ని తిట్టాలన్నారు.

Updated On 6 Jan 2024 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story