రాష్ట్రంలోని పరిణామాలను గమనిస్తున్నట్లు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌(S. Abdul Nazeer) చెప్పారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu )అన్నారు. విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో అచ్చెన్న నేతృత్వంలో టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్టు

రాష్ట్రంలోని పరిణామాలను గమనిస్తున్నట్లు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌(S. Abdul Nazeer) చెప్పారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu )అన్నారు. విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో అచ్చెన్న నేతృత్వంలో టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్టు, రిమాండ్‌ అనంతరం జరిగిన పరిణామాలు, ఏపీ పోలీసుల(AP Police) తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిణామాలపై గవర్నర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. తనకు కూడా తెలియకుండా అరెస్టు చేసినట్లు గవర్నర్‌ తెలిపారని అచ్చెన్న చెప్పారు.

వైసీపీ(YCP) పరిస్థితి ప్రమాదకరంగా ఉంది : ‘‘రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. నాలుగేళ్ల పాలనలో అవినీతి కనిపించలేదా ?. ఇప్పుడే ఎందుకు తెలిసింది. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా 15 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. జనసేనతో కలిసి పోటీచేస్తే వైసీపీ చిరునామా గల్లంతవుతుందని సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఐప్యాక్‌ సర్వేలో తేలింది. లోకేష్‌ పాదయాత్రను అణచివేయాలని యత్నించారు. కావాలని చంద్రబాబును జైలుకు పంపడం దారుణం. 48 గంటల పాటు రోడ్లపై తిప్పి సైకో ఆనందం పొందారు. చంద్రబాబు మనో ధైర్యాన్ని ఎప్పటికీ తొలగించలేరు. టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకెళ్తాం. ఈ కేసుతో టీడీపీ నేతలకు సంబంధం ఏంటి? తప్పుడు ఆలోచన గల వ్యక్తులు ఉన్న ప్రభుత్వం ఇది. చంద్రబాబును జైలులో ఏమన్నా చేస్తారనే అనుమానం ఉందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Updated On 11 Sep 2023 2:23 AM GMT
Ehatv

Ehatv

Next Story