వైసీపీ(YCP) అధినేత జ‌గ‌న్(Jagan) పలువురు సిట్టింగుల విష‌యంలో తీసుకున్న‌ నిర్ణయాల‌పై ఏపీ రాజ‌కీయాల్లో తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. జగన్ మంత్రి గుడివాడ అమర్ నాథ్‌ను(Gudiwada amarnath) సైతం ప‌క్క‌న‌పెట్టారు. ఈ విష‌య‌మై టీడీపీ(TDP) నేత ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి అమర్ నాథ్ క‌న్నీరు పెట్టుకున్న వీడియోను షేర్ చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ధూళిపాళ్ల ట్వీట్‌లో.. జగన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవరికైనా ఇదేగతి.. నిన్ను గుడ్డిగా నమ్మిన గుడివాడ అమర్నాథ్ ను […]

వైసీపీ(YCP) అధినేత జ‌గ‌న్(Jagan) పలువురు సిట్టింగుల విష‌యంలో తీసుకున్న‌ నిర్ణయాల‌పై ఏపీ రాజ‌కీయాల్లో తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. జగన్ మంత్రి గుడివాడ అమర్ నాథ్‌ను(Gudiwada amarnath) సైతం ప‌క్క‌న‌పెట్టారు. ఈ విష‌య‌మై టీడీపీ(TDP) నేత ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి అమర్ నాథ్ క‌న్నీరు పెట్టుకున్న వీడియోను షేర్ చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

ధూళిపాళ్ల ట్వీట్‌లో.. జగన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవరికైనా ఇదేగతి.. నిన్ను గుడ్డిగా నమ్మిన గుడివాడ అమర్నాథ్ ను కూడా ఏడిపించేశావు జగన్ రెడ్డి..! నిన్ను చూసుకొని చంద్రబాబుగారిపై, పవన్ కల్యాణ్ గారిపై అవాకులు చవాకులు పేలాడు. చివరికి తనను గాలిలో నిలబెట్టేసరికి ఇదిగో ఇలా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు..! అంటూ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

ఇదిలావుంటే.. అనకాపల్లి నియోజకవర్గాన్ని వదలాల్సి వస్తుందంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లిలో వైసీపీ కొత్త నియోజకవర్గ ఇంఛార్జ్ మలసాల భరత్ కుమార్(Bharath) పరిచయ సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఆయ‌న మాట్లాడుతూ.. రాజకీయంగా పునర్జన్మను ఇచ్చిన అనకాపల్లి ప్రజలను వదిలి వెళ్ళలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు. త‌న రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానంటానన్నారు. సీఎం జగన్ ఆదేశిస్తే పోటీకి దూరమై కార్యకర్తగా వైసీపీ గెలుపునకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Updated On 4 Jan 2024 7:42 AM GMT
Ehatv

Ehatv

Next Story